అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.!
- November 12, 2017అకారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా భారత సంతతికి చెందిన 40ఏళ్ల ఆకాశ్ ఆర్ తలాటి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఉత్తరకరోలినాలో ఆకాశ్కు నైట్స్ ఇన్ అండ్ డైమండ్స్ జెంటిల్మన్ క్లబ్ ఉంది. ఆ క్లబ్కు మార్కెసీ దెవిట్(23) అనే వ్యక్తి వచ్చాడు. క్లబ్లో దెవిట్ గందరగోళం సృష్టించడంతో భద్రతా సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపంతో వూగిపోయిన దెవిట్ తన కారు దగ్గరికి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి భదత్రా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.
అదే సమయంలో ఆకాశ్ రావడంతో అతడికి బుల్లెట్లు తగిలాయి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా.. తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కాల్పులు జరిపిన దెవిట్ను అరెస్టు చేశారు. ఆకాశ్ గుజరాత్వాసిగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. 'ఆకాశ్ హత్యకు సంబంధించిన విషయాలను అమెరికాలోని భారత దౌత్యకార్యాలయ అధికారులు సమాచారం అందించారు. వాళ్ల కుటుంబసభ్యులతో మాట్లాడాం. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని సుష్మా ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు