అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.!
- November 12, 2017
అకారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా భారత సంతతికి చెందిన 40ఏళ్ల ఆకాశ్ ఆర్ తలాటి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఉత్తరకరోలినాలో ఆకాశ్కు నైట్స్ ఇన్ అండ్ డైమండ్స్ జెంటిల్మన్ క్లబ్ ఉంది. ఆ క్లబ్కు మార్కెసీ దెవిట్(23) అనే వ్యక్తి వచ్చాడు. క్లబ్లో దెవిట్ గందరగోళం సృష్టించడంతో భద్రతా సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపంతో వూగిపోయిన దెవిట్ తన కారు దగ్గరికి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి భదత్రా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.
అదే సమయంలో ఆకాశ్ రావడంతో అతడికి బుల్లెట్లు తగిలాయి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా.. తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కాల్పులు జరిపిన దెవిట్ను అరెస్టు చేశారు. ఆకాశ్ గుజరాత్వాసిగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. 'ఆకాశ్ హత్యకు సంబంధించిన విషయాలను అమెరికాలోని భారత దౌత్యకార్యాలయ అధికారులు సమాచారం అందించారు. వాళ్ల కుటుంబసభ్యులతో మాట్లాడాం. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని సుష్మా ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







