వచ్చే 48 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
- November 12, 2017
శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడనున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కాగా మధ్య భారతంలో అధికపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







