వచ్చే 48 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
- November 12, 2017
శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడనున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కాగా మధ్య భారతంలో అధికపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







