తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి
- November 13, 2017
ప్రశ్నోత్తరాల అనంతరం రైతు సమన్వయసమితులు, సాగుకు 8వేల ఆర్ధిక సాయంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శుక్రవారమే దీనిపై చర్చ ప్రారంభమైంది. టీఆర్ఎస్ సభ్యుడు శేఖర్ రెడ్డి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడంతో అంశంపై చర్చను డిప్యూటీ స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. రైతు సమన్వయ సమితీలు టీఆర్ఎస్ కమిటీలుగా ఉన్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్..అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇవాళ సభ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త గ్రామ పంచాయతీలపై పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే కొత్త పంచాయతీలపై ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలు కొరింది ప్రభుత్వం. దీనిపై 5 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నాలుగు కేటగిరీలుగా పంచాయతీలను విభజించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీనిపై టీఆర్ఎస్పీలో చర్చించాలని గులాాబీ బాస్ నిర్ణయించారు. సమావేశానికి సంబంధించి పార్టీ నేతలకు సమాచారం వెళ్లింది. అసెంబ్లీ త్వరగా ముగిస్తే ఇవాళే సమావేశం జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







