తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి
- November 13, 2017
ప్రశ్నోత్తరాల అనంతరం రైతు సమన్వయసమితులు, సాగుకు 8వేల ఆర్ధిక సాయంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శుక్రవారమే దీనిపై చర్చ ప్రారంభమైంది. టీఆర్ఎస్ సభ్యుడు శేఖర్ రెడ్డి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడంతో అంశంపై చర్చను డిప్యూటీ స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. రైతు సమన్వయ సమితీలు టీఆర్ఎస్ కమిటీలుగా ఉన్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్..అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇవాళ సభ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త గ్రామ పంచాయతీలపై పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే కొత్త పంచాయతీలపై ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలు కొరింది ప్రభుత్వం. దీనిపై 5 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నాలుగు కేటగిరీలుగా పంచాయతీలను విభజించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీనిపై టీఆర్ఎస్పీలో చర్చించాలని గులాాబీ బాస్ నిర్ణయించారు. సమావేశానికి సంబంధించి పార్టీ నేతలకు సమాచారం వెళ్లింది. అసెంబ్లీ త్వరగా ముగిస్తే ఇవాళే సమావేశం జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









