శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం కోలకతా చేరుకున్న టీమిండియా
- November 13, 2017
పర్యాటక జట్టు శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు ఆదివారం రాత్రికి కోల్కతా చేరుకున్నారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానెతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా ఇప్పటికే కోల్కతా వచ్చారు. సారథి విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ఆటగాళ్లు సోమవారం జట్టు సభ్యులతో కలవనున్నారు. విశ్రాంతి పేరుతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను టెస్టు సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అదీగాక లంక ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో ఎలాగైనా టెస్టు గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభంకానుంది. బోర్డు ఎలెవన్ ప్రెసిడెంట్స్తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్ను శ్రీలంక డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు