జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వనున్న కెసిఆర్
- November 13, 2017
రైతులకు రూ.8వేల పెట్టుబడి సాయం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. రైతులకు పెట్టుడి సాయంపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని అన్నారు. గతంలో చాలా వ్యవస్థలు, నిధులు గ్రామ, మండల సమితుల చేతుల్లో ఉండేవని.. కాంగ్రెస్ పార్టీ వాటిని కేంద్రీకృతం చేస్తే.. భాజపా ప్రభుత్వం అదే విదానాన్ని కొనసాగిస్తోందన్నారు. జనవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
విపక్షాలు అనవసర విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్ కోరారు. ప్రాజెక్టులు పూర్తికాకూడదు, చెరువులు నిండకూడదు, ప్రజలకు తాగునీరు అందకూడదని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది తెరాస మాత్రమేనని.. అందుకే రైతు సమన్వయ సమితుల్లో తెరాస కార్యకర్తలే ఉంటారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆపాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







