శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం కోలకతా చేరుకున్న టీమిండియా
- November 13, 2017
పర్యాటక జట్టు శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు ఆదివారం రాత్రికి కోల్కతా చేరుకున్నారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానెతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా ఇప్పటికే కోల్కతా వచ్చారు. సారథి విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ఆటగాళ్లు సోమవారం జట్టు సభ్యులతో కలవనున్నారు. విశ్రాంతి పేరుతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను టెస్టు సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అదీగాక లంక ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో ఎలాగైనా టెస్టు గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభంకానుంది. బోర్డు ఎలెవన్ ప్రెసిడెంట్స్తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్ను శ్రీలంక డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







