శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం కోలకతా చేరుకున్న టీమిండియా
- November 13, 2017
పర్యాటక జట్టు శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు ఆదివారం రాత్రికి కోల్కతా చేరుకున్నారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానెతో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా ఇప్పటికే కోల్కతా వచ్చారు. సారథి విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ఆటగాళ్లు సోమవారం జట్టు సభ్యులతో కలవనున్నారు. విశ్రాంతి పేరుతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను టెస్టు సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అదీగాక లంక ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో ఎలాగైనా టెస్టు గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభంకానుంది. బోర్డు ఎలెవన్ ప్రెసిడెంట్స్తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్ను శ్రీలంక డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









