కేరళలోని కొచ్చిన్ విమానంలో హైజాక్ కలకలం
- November 13, 2017
బాంబుతో విమానాన్ని హైజాక్ చేస్తానంటూ బెంబేలెత్తించిన ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ ప్రయోక్త (యాంకర్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయికి 170 మందితో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ 9డబ్ల్యూ 825 విమానంలో త్రిస్సూర్కు చెందిన 26 ఏళ్ల క్లిన్స్ వర్గీస్ టికెట్ బుక్చేసుకున్నారు. అయితే విమానం ఎక్కే సమయంలో ఆయన చరవాణితో ఓ వీడియో తీశారు. తన దగ్గరున్న 'హ్యాపీ బాంబ్'తో కొద్దిసేపట్లో విమానాన్ని హైజాక్ చేయబోతున్నానని ఓ సందేశాన్నీ పంపారు. అంతేకాదు ఈ విషయాన్ని తనతోపాటు వచ్చిన మరో ప్రయాణికుడికీ చెప్పారు. ఈ సంగతి గమనించిన సిబ్బంది భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులందరినీ సిబ్బంది బయటకు పంపించారు. వర్గీస్ బ్యాగ్ సహా విమానం మొత్తం జాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు. వర్గీస్ను తోటి ప్రయాణికుడితోపాటు పోలీసులకూ అప్పగించారు.
ఘటన కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం