పాక్ కు షాకిచ్చిన బలూచిస్థాన్ ఉద్యమం
- November 14, 2017
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘బలూచిస్థాన్కు విముక్తి కల్పించండి’ అంటూ లండన్ ప్రజారవాణా బస్సులపై భారీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు వంద బస్సులపై ఈ భారీ పోస్టర్లు అంటించి వరల్డ్ బలూచ్ ఆర్గనైజేషన్ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడం పాకిస్థాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బలూచ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూబీవో) కార్యకలాపాలను నిషేధించేందుకు పాక్ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా లండన్లోని ప్రజారవాణా బస్సులపై ఈ భారీ పోస్టర్లు దర్శనమివ్వడంతో పాక్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డబ్ల్యూబీవో ఈ ప్రచారాన్ని ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్తోంది.
’బలూచిస్థాన్లో పాక్ సర్కారు సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను బహిర్గతం చేసేందుకు, బలూచ్ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటేందుకు లండన్లో మూడో దఫా ప్రచారాన్ని చేపట్టాం. ఇంతకుముందు లండన్లో మేం టాక్సీలపై ప్రకటనలు ఇచ్చాం. అనంతరం రోడ్డుపక్కన ఉండే బిల్బోర్ట్స్పై మా నినాదాన్ని చాటాం. ఇప్పుడు లండన్ బస్సులపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాం’ అని డబ్ల్యూబీవో అధికార ప్రతినిధి భవల్ మెంగల్ తెలిపారు. గతంలో డబ్ల్యూబీవో ఇదేవిధంగా ట్యాక్సీలపై నిర్వహించిన ప్రచారంపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ప్రచారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం