మెట్రో రైలు.. తేడా వస్తే జైలు!
- November 14, 2017
హైదరాబాద్: రాజధానికి తలమానికం కానున్న మెట్రో రైలు ప్రాజెక్టు మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందని భావిస్తున్న మెట్రో రైళ్లలో ప్రయాణం కోసం భాగ్యనగర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేవి ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ విడుదల చేసింది. వీటితో పాటు నిబంధనలు గురించి కూడా ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని ప్రతి మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన సూచికల ద్వారా తెలుస్తోంది. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో నోటీసు బోర్డులో పెట్టారు.
అతిక్రమణకు పాల్పడేవారికి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. మెట్రో రైల్ (వినియోగం, నిర్వహణ) చట్టం-2002 ప్రకారం కొన్ని ఉల్లంఘనలకు జైలు శిక్ష విధిస్తారు. విధ్వంసక చర్యలకు దిగేవారికి సెక్షన్-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించనున్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ఎటువంటి అతిక్రమణలకు పాల్పడినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు సూచించింది. కాగా, ఒక్కో మెట్రో రైలులోని మూడు కార్లలో ఒకేసారి గరిష్ఠంగా 974 మంది ప్రయాణించే వీలుంది. ప్రతి మెట్రో రైలులో 126 మంది కూర్చుని, 848 మంది నిలబడి ప్రయాణించడానికి అనువుగా డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం