అద్భుత ఆఫర్ ప్రకటించిన ఎయిర్టెల్
- November 14, 2017
భారత టెలికం రంగంలోని పోటీని దృష్టిలో ఉంచుకొని దేశంలోనే అతి పెద్ద నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్ తన ప్రీ పెయిడ్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. రూ.3,999తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు అన్ని లోక్ల్, ఎస్టీడీ కాల్స్ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 300 జీబీ డేటాతోపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపే సదుపాయముంది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్సైట్లో వెల్లడించిందిఈ ఆఫర్తోపాటు మరి కొన్ని కాంబో ప్యాక్లను కూడా ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది. 1999తో రీఛార్జ్ చేయించుకుంటే 180 రోజుల పాటు అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్ తోపాటు 125జీబీ డేటాను పొందవచ్చు. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా చేసుకునే వీలుంటుంది. రూ. 999తో రీఛార్జ్చేయించుకుంటే 90 రోజుల పాటు అన్ని లోకల్,ఎస్టీడీ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. 60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు అదనంగా ఇస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







