అద్భుత ఆఫర్ ప్రకటించిన ఎయిర్టెల్
- November 14, 2017
భారత టెలికం రంగంలోని పోటీని దృష్టిలో ఉంచుకొని దేశంలోనే అతి పెద్ద నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్ తన ప్రీ పెయిడ్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. రూ.3,999తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు అన్ని లోక్ల్, ఎస్టీడీ కాల్స్ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా 300 జీబీ డేటాతోపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపే సదుపాయముంది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్సైట్లో వెల్లడించిందిఈ ఆఫర్తోపాటు మరి కొన్ని కాంబో ప్యాక్లను కూడా ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది. 1999తో రీఛార్జ్ చేయించుకుంటే 180 రోజుల పాటు అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్ తోపాటు 125జీబీ డేటాను పొందవచ్చు. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా చేసుకునే వీలుంటుంది. రూ. 999తో రీఛార్జ్చేయించుకుంటే 90 రోజుల పాటు అన్ని లోకల్,ఎస్టీడీ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. 60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు అదనంగా ఇస్తారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం