అత్యాచారం: వ్యక్తికి జైలు
- November 15, 2017దుబాయ్: దుబాయ్ సెంటర్ రెస్ట్రమ్లో ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డ నేరానికిగాను ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు. బాధితురాల్ని 26 ఏళ్ళ నేపాలీగా గుర్తించారు. మద్యం మత్తులో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016 జులై 10న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన జరిగిన రోజే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షాపింగ్ సెంటర్లోని రెస్ట్ రూమ్లో తాను ఉండగా, అద్దంలో నిందితుడ్ని తాను గుర్తించాననీ, అతన్ని ప్రశ్నించేలోపే, అతను తనపై దాడి చేశాడని బాధితురాలు వివరించింది. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా, నిందితుడి పశుబలం ముందు నిలవలేకపోయింది. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేశాడు నిందితుడు. ఈ కేసులో తనకు పడ్డ శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి నిందితుడికి 30 రోజులపాటు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు