అత్యాచారం: వ్యక్తికి జైలు

- November 15, 2017 , by Maagulf
అత్యాచారం: వ్యక్తికి జైలు

దుబాయ్‌: దుబాయ్‌ సెంటర్‌ రెస్ట్‌రమ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డ నేరానికిగాను ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు. బాధితురాల్ని 26 ఏళ్ళ నేపాలీగా గుర్తించారు. మద్యం మత్తులో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016 జులై 10న బుర్‌ దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన జరిగిన రోజే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షాపింగ్‌ సెంటర్‌లోని రెస్ట్‌ రూమ్‌లో తాను ఉండగా, అద్దంలో నిందితుడ్ని తాను గుర్తించాననీ, అతన్ని ప్రశ్నించేలోపే, అతను తనపై దాడి చేశాడని బాధితురాలు వివరించింది. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా, నిందితుడి పశుబలం ముందు నిలవలేకపోయింది. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేశాడు నిందితుడు. ఈ కేసులో తనకు పడ్డ శిక్షపై అప్పీల్‌ చేసుకోవడానికి నిందితుడికి 30 రోజులపాటు అవకాశం ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com