అత్యాచారం: వ్యక్తికి జైలు
- November 15, 2017
దుబాయ్: దుబాయ్ సెంటర్ రెస్ట్రమ్లో ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డ నేరానికిగాను ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు. బాధితురాల్ని 26 ఏళ్ళ నేపాలీగా గుర్తించారు. మద్యం మత్తులో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016 జులై 10న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన జరిగిన రోజే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షాపింగ్ సెంటర్లోని రెస్ట్ రూమ్లో తాను ఉండగా, అద్దంలో నిందితుడ్ని తాను గుర్తించాననీ, అతన్ని ప్రశ్నించేలోపే, అతను తనపై దాడి చేశాడని బాధితురాలు వివరించింది. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా, నిందితుడి పశుబలం ముందు నిలవలేకపోయింది. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేశాడు నిందితుడు. ఈ కేసులో తనకు పడ్డ శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి నిందితుడికి 30 రోజులపాటు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







