అత్యాచారం: వ్యక్తికి జైలు
- November 15, 2017
దుబాయ్: దుబాయ్ సెంటర్ రెస్ట్రమ్లో ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డ నేరానికిగాను ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు. బాధితురాల్ని 26 ఏళ్ళ నేపాలీగా గుర్తించారు. మద్యం మత్తులో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016 జులై 10న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన జరిగిన రోజే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షాపింగ్ సెంటర్లోని రెస్ట్ రూమ్లో తాను ఉండగా, అద్దంలో నిందితుడ్ని తాను గుర్తించాననీ, అతన్ని ప్రశ్నించేలోపే, అతను తనపై దాడి చేశాడని బాధితురాలు వివరించింది. బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా, నిందితుడి పశుబలం ముందు నిలవలేకపోయింది. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేశాడు నిందితుడు. ఈ కేసులో తనకు పడ్డ శిక్షపై అప్పీల్ చేసుకోవడానికి నిందితుడికి 30 రోజులపాటు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







