జపాన్: భారతీయులకు వీసా నిబంధనల్లో సడలింపు
- November 15, 2017
భారతీయులకు వీసా నిబంధనలను వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సడలించాలని, తమ దేశంలో తాత్కాలిక విడిది కోసం వచ్చేవారికి 'బహుళ ప్రవేశ వీసా'లను జారీ చేయాలని జపాన్ నిర్ణయించింది. పర్యాటకులకు, వ్యాపారులకు, తరచూ వచ్చే సందర్శకుల కోసం ఈ సడలింపులు ఉంటాయని ఇక్కడి జపాన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ సడలింపులతో వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరమవడమే కాకుండా, అర్హత గల అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఉపాధికి సంబంధించిన ధ్రువీకరణ, తాత్కాలిక విడిదికి కారణాలను తెలిపే లేఖలను ఇక 'బహుల ప్రవేశ వీసా'లకు సమర్పించనవసరం లేదు. పాస్పోర్ట్ వీసా దరఖాస్తు (అభ్యర్థి ఫొటో సహా), ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పత్రం (టూరిస్టులకు), వాణిజ్య సంబంధాలకు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. బహుళ ప్రవేశ వీసా గరిష్ట కాలపరిమితి 5 ఏళ్లు అయినప్పటికీ జపాన్లో 90 రోజులకు మించకుండా తాత్కాలికంగా విడిది చేసేందుకు వీలుంటుంది. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాల్లో భారత్తో సంబంధాలను మరింతగా పెంచుకునేలా జపాన్ తన వీసా నిబంధనల్లో ఈ సడలింపులను ప్రకటించింది. భారతీయ విద్యార్థులకు సంబంధించి వీసా నిబంధనలను గత ఫిబ్రవరిలోనే జపాన్ సరళీకరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









