జపాన్: భారతీయులకు వీసా నిబంధనల్లో సడలింపు
- November 15, 2017
భారతీయులకు వీసా నిబంధనలను వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సడలించాలని, తమ దేశంలో తాత్కాలిక విడిది కోసం వచ్చేవారికి 'బహుళ ప్రవేశ వీసా'లను జారీ చేయాలని జపాన్ నిర్ణయించింది. పర్యాటకులకు, వ్యాపారులకు, తరచూ వచ్చే సందర్శకుల కోసం ఈ సడలింపులు ఉంటాయని ఇక్కడి జపాన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ సడలింపులతో వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరమవడమే కాకుండా, అర్హత గల అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఉపాధికి సంబంధించిన ధ్రువీకరణ, తాత్కాలిక విడిదికి కారణాలను తెలిపే లేఖలను ఇక 'బహుల ప్రవేశ వీసా'లకు సమర్పించనవసరం లేదు. పాస్పోర్ట్ వీసా దరఖాస్తు (అభ్యర్థి ఫొటో సహా), ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పత్రం (టూరిస్టులకు), వాణిజ్య సంబంధాలకు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. బహుళ ప్రవేశ వీసా గరిష్ట కాలపరిమితి 5 ఏళ్లు అయినప్పటికీ జపాన్లో 90 రోజులకు మించకుండా తాత్కాలికంగా విడిది చేసేందుకు వీలుంటుంది. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాల్లో భారత్తో సంబంధాలను మరింతగా పెంచుకునేలా జపాన్ తన వీసా నిబంధనల్లో ఈ సడలింపులను ప్రకటించింది. భారతీయ విద్యార్థులకు సంబంధించి వీసా నిబంధనలను గత ఫిబ్రవరిలోనే జపాన్ సరళీకరించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







