కేసర్ ఫిర్నీ
- November 15, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, బాస్మతి బియ్యం - నూరు గ్రాములు,పంచదార - 200 గ్రాములు, కుంకుమపువ్వు - ఒక గ్రాము, పిస్తా పొడి - ఐదు గ్రాములు, ఏలకుల పొడి - ఐదు గ్రాములు.
తయారుచేసే విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాక, బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యానికి రెండు వందల మి.లీ. పాలు కలిపి పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో మిగిలిన పాలు పోసి స్టౌ మీద పెట్టి చిక్కబడి మూడో వంతు అయ్యేదాకా మరిగించుకోవాలి. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపండి. పంచదార కరిగిన తర్వాత పాలల్లో బియ్యం మిశ్రమాన్ని పోసి కలపాలి. బియ్యం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. దించేముందు పిస్తాపప్పు ముక్కల్ని, కుంకుమ పువ్వుని వేసి బాగా చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ పైన తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా