కేసర్ ఫిర్నీ
- November 15, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, బాస్మతి బియ్యం - నూరు గ్రాములు,పంచదార - 200 గ్రాములు, కుంకుమపువ్వు - ఒక గ్రాము, పిస్తా పొడి - ఐదు గ్రాములు, ఏలకుల పొడి - ఐదు గ్రాములు.
తయారుచేసే విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాక, బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బియ్యానికి రెండు వందల మి.లీ. పాలు కలిపి పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో మిగిలిన పాలు పోసి స్టౌ మీద పెట్టి చిక్కబడి మూడో వంతు అయ్యేదాకా మరిగించుకోవాలి. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపండి. పంచదార కరిగిన తర్వాత పాలల్లో బియ్యం మిశ్రమాన్ని పోసి కలపాలి. బియ్యం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. దించేముందు పిస్తాపప్పు ముక్కల్ని, కుంకుమ పువ్వుని వేసి బాగా చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ పైన తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







