సౌదీ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి

- November 15, 2017 , by Maagulf
సౌదీ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్.. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరుబుజ్జలి మండలం ఇసుకలపాలేనికి చెందిన శ్రీనివాసరావ్.. సౌదీలోని అల్ జిహా కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ జెడ్డాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు అల్ జిహా సంస్థ సహకారం అందిస్తున్నప్పటికీ.. స్థానిక చట్టాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని శ్రీనివాసరావు మిత్రులు చెబుతున్నారు. ప్రభుత్వం, నేతలు స్పందించి శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com