భారీగా ఒంటె మాంసం తరలింపు...పట్టుకున్న పోలీసులు
- November 15, 2017
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మాంసం తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. అనంతరం ఈ మాంసం వ్యవహారంతో సంబంధం ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







