స్కూల్ లో దారుణం - సంపులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
- November 16, 2017
హైదరాబాద్: మల్కాజిగిరిలోని బచ్పన్ స్కూల్ను విద్యాశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బాలల దినోత్సవం రోజున రెండున్నరేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. అదే రోజు విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపారు. ఈ విచారణలో యాజమాన్యానిదే తప్పు అని తేలింది. దీంతో విద్యాశాఖ అధికారులు గురువారం నాడు స్థానిక విద్యాశాఖ అధికారులకు పాఠశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో దానిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ రాఘవేంద్ర, స్కూల్ కౌన్సెలర్ ఉన్ని కృష్ణన్, వాచ్మన్ ప్యాట్రిక్లను అరెస్టు చేశారు. కాగా, సంప్లో పడి రెండున్నరేళ్ల శివ చనిపోయాడు, అతను నర్సరీ చదువుతున్నాడు. బాలల దినోత్సవం రోజున స్కూల్లోని నీటి సంపు తెరిచి ఉంది. దాని పైన మూత లేకపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









