స్కూల్ లో దారుణం - సంపులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
- November 16, 2017
హైదరాబాద్: మల్కాజిగిరిలోని బచ్పన్ స్కూల్ను విద్యాశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బాలల దినోత్సవం రోజున రెండున్నరేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. అదే రోజు విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపారు. ఈ విచారణలో యాజమాన్యానిదే తప్పు అని తేలింది. దీంతో విద్యాశాఖ అధికారులు గురువారం నాడు స్థానిక విద్యాశాఖ అధికారులకు పాఠశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో దానిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ రాఘవేంద్ర, స్కూల్ కౌన్సెలర్ ఉన్ని కృష్ణన్, వాచ్మన్ ప్యాట్రిక్లను అరెస్టు చేశారు. కాగా, సంప్లో పడి రెండున్నరేళ్ల శివ చనిపోయాడు, అతను నర్సరీ చదువుతున్నాడు. బాలల దినోత్సవం రోజున స్కూల్లోని నీటి సంపు తెరిచి ఉంది. దాని పైన మూత లేకపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







