కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూలు విడుదల
- November 20, 2017
ఢిల్లీః కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ అని సీడబ్ల్యూసీ ప్రకటించింది. డిసెంబర్ 1 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, డిసెంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక, 11న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ మినహా మరెవరైనా నామినేషన్ వేస్తారని భావించడం లేదని, ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీలోని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని కొనసాగించాలని భావించిన క్రమలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్టు వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







