హీరో శివాజీ అరెస్ట్
- November 20, 2017
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఉదయం ప్రతిపక్ష, విపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరంతా ' ఛలో అసెంబ్లీ ర్యాలీ' నిర్వహించారు. కాగా.. ఈ రోజు తెల్లవారు జామున పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రత్యేక హోదా సాదన సమితి సంఘ నేతలు చలసాని శ్రీనివాసరావు, సినీ హీరో శివాజీ తదితరులు ఉన్నారు. ఈ విషయంపై హీరో శివాజీ మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేద్దామనుకున్నామని.. సీఎం దానిని అడ్డుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







