సౌదీ అరేబియా ఎడారిలో వింత రాతి కట్టడాలు
- November 20, 2017
రియాద్: ' ఈ నల్లని రాళ్ళలో..ఏ కన్నులూ దాగినో ...ఈ బండల మాటున... ఏ గుండెలు మోగినో ' అంటూ సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు అమరశిల్పి జక్కన మాదిరిగా కూనిరాగాలు తీస్తున్నారు. వారి ఆసక్తికి అసలు కారణమేమిటంటే...ఎటూ చూసినా భారీ ఇసుక గుట్టలు..మొక్క మోడు మొలవని ఆ సౌదీ అరేబియా ఎడారిలో కొన్ని రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన నిర్మాణాలు వారికి ఎంతో వింతను కలిగిస్తున్నాయి. అవి ఏమిటో తెలియక సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పెట్టుకొంటున్నారు. ఈ రహస్యం కనిపట్టేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, ఆ మిస్టరీ వీడటం లేదు. ఇక వారికి అంతర్జాలంలో గూగుల్ తల్లి శరణమైంది. గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని గుర్తించారు. ఏవో రాళ్లు శ్రద్ధగా పేర్చినట్లు కనపడుతున్న ఆ ఆకారంలో ఏదో దేవ రహస్యం దాగుందని..అవి ఏ కాలానికి చెందినవని... ఆ రాళ్ళ వరుసలను పేర్చినవారు ఎవరై ఉంటారో తేల్చుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేవిడ్ కెన్నడీ అనే ప్రముఖ పురాతత్వవేత్తను అధికారులు ప్రత్యేకంగా సౌదీకి రప్పించారు. ఆయన తన బృందం సహయంతో ఆ నిర్మాణాలపై పరిశోధనలు జరిపారు. ఆ రాళ్లు 9 వేల ఏళ్ల క్రితం అలా పేర్చాబడ్డాయని కెన్నడీ తేల్చేశారు. అయితే అవి ఆనాటి మానవుల సమాధులు అయి ఉండవచ్చని కెన్నడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







