చైనా: ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్
- November 20, 2017
సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణిని చైనా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దంచేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ను వచ్చే ఏడాదికళ్లా పూర్తిచేయనున్నట్లు చైనా మీడియా తెలిపింది. బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ మిస్సైల్ ....ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. డాంగ్ఫెన్గ్ 41 అనే కొత్త క్షిపణి మాచ్ టెన్ కంటే అత్యంత వేగవంతమైంది. ఇది శత్రుదేశాల మిస్సైల్ హెచ్చరికలను పసిగడుతూనే దూసుకుపోతుంది. అయితే దీని రూపకల్పనకు చైనా పీఫుల్స్ లిబరేషన్ ఆర్మీ 2012లోనే ప్రకటించింది. 2018 ప్రధమార్ధంలో దీన్ని పూర్తిచేయనుంది. మూడు రకాల ఇందనాన్ని ఉపయోగించుకోగల సామర్ధ్యం ఉన్న ఈ డాంగ్పెన్గ్ 41 క్షిపణి, 12వేల కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను సునాయాసంగా చేదించగలదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







