చైనా: ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్
- November 20, 2017
సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణిని చైనా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దంచేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ను వచ్చే ఏడాదికళ్లా పూర్తిచేయనున్నట్లు చైనా మీడియా తెలిపింది. బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ మిస్సైల్ ....ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. డాంగ్ఫెన్గ్ 41 అనే కొత్త క్షిపణి మాచ్ టెన్ కంటే అత్యంత వేగవంతమైంది. ఇది శత్రుదేశాల మిస్సైల్ హెచ్చరికలను పసిగడుతూనే దూసుకుపోతుంది. అయితే దీని రూపకల్పనకు చైనా పీఫుల్స్ లిబరేషన్ ఆర్మీ 2012లోనే ప్రకటించింది. 2018 ప్రధమార్ధంలో దీన్ని పూర్తిచేయనుంది. మూడు రకాల ఇందనాన్ని ఉపయోగించుకోగల సామర్ధ్యం ఉన్న ఈ డాంగ్పెన్గ్ 41 క్షిపణి, 12వేల కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను సునాయాసంగా చేదించగలదు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







