దుబాయ్ నుంచి వచ్చాక! యువకుడి ఆత్మహత్య...ఆమే కారణం
- November 20, 2017
మెదక్: ఓ వివాహిత వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగరి రమేష్(23) అనే యువకుడు ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మూడు నెలల క్రితమే తిరిగొచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలుస్తోంది.
వివాహిత వేధింపులతో రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతిపై అతని తండ్రి మొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







