అజ్మన్లో కారు దొంగలు: ఇద్దరి అరెస్ట్
- November 21, 2017
అజ్మన్: అజ్మన్ పోలీసులు, ఇద్దరు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. ఓ కారులోంచి 450,000 దిర్హామ్లు దొంగిలించారు నిందితులు. అజ్మన్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తన కారుని నిలిపిన జిసిసి జాతీయుడు, షాప్లోకి వెళ్ళగా, అదనుచూసి దొంగలు, అందులోంచి పెద్ద మొత్తంలో నగుదను కాజేశారు. బాధితుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)కి ఫిర్యాదు చేశారు. కారు ముందున్న అద్దాన్ని పగలగొట్టి, నిందితులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు బాధితుడు. ఫిర్యాదు అందుకోగానే, సీఐడీ రంగంలోకి దిగి, నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు, దొంగతనాన్ని అంగీకరించారు. పోలీసులు, పోయిన సొమ్ముని తిరిగి బాధితుడికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విలువైన వస్తువులు, డబ్బుని కార్లలో కన్పించేలా ఉంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







