స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ!
- November 21, 2017
పాట్న: బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం స్కూల్ టీచర్లకు ఓ విచిత్రమైన డ్యూటీ వేసింది. బహిరంగ విసర్జనకు వెళ్లేవారిని ఓ కంట కనిపెట్టాలని ఆదేశించింది. మరుగుదొడ్లు వినియోగించకుండా బహిరంగంగా పనికానిచ్చే వారిని ఫోటోలు తీయాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు అన్ని బ్లాకుల్లోని విద్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం టీచర్లు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఎవరెవరు చెంబు పట్టుకుని వెళ్తున్నారో కాపలా కాయాల్సిఉంటుంది. అధ్యాపకులు ఈ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపల్స్కు అప్పగించారు.
వృత్తికి సంబంధంలేని డ్యూటీలు చేయాలంటూ బీహార్ ప్రభుత్వం అక్కడి టీచర్లను ఆదేశించడం ఇదేం కొత్తకాదు. గతంలో జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల డ్యూటీలు, ఓటర్ల జాబితా సరిచూడడం సహా పలు కార్యక్రమాల్లో ఉపాధ్యాయులే విధులు నిర్వహించాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు