ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- November 22, 2017
ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ట్రాఫిక్ జరీమానాల్ని 50 శాతం తగ్గించాల్సిందిగా సంబంధిత శాఖలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. షేక్ మొహమ్మద్ జారీ చేసిన రిజల్యూషన్ ప్రకారం, 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 మధ్య జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఏడాది అంటే 2017 నుంచి జారీ అయిన జరీమానాలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన వివరాల్ని దుబాయ్ పోలీసులు పోస్ట్ చేశారు. 2017లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదని దుబాయ్ పోలీస్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. మోటరిస్టులు తమ జరీమానాల్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెషీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









