ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- November 22, 2017
ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ట్రాఫిక్ జరీమానాల్ని 50 శాతం తగ్గించాల్సిందిగా సంబంధిత శాఖలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. షేక్ మొహమ్మద్ జారీ చేసిన రిజల్యూషన్ ప్రకారం, 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 మధ్య జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఏడాది అంటే 2017 నుంచి జారీ అయిన జరీమానాలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన వివరాల్ని దుబాయ్ పోలీసులు పోస్ట్ చేశారు. 2017లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదని దుబాయ్ పోలీస్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. మోటరిస్టులు తమ జరీమానాల్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెషీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







