గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్లో లభ్యం
- November 22, 2017
భారీ వర్షాల వల్ల తలెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఒమన్లో కనుగొన్నారు. నవంబర్ 16న 18 ఏళ్ళ ఆల్బర్ట్ జాయ్, తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాహనంలో షికారుకి వెళ్ళగా, ఆకస్మిక వరదల్లో ఆ కారు చిక్కుకపోయింది. ఎమిరేటీ వ్యక్తి ఒకరు అత్యంత సాహసోపేతంగా ఆ కారులోంచి ఐదుగుర్ని కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆల్బర్ట్ జాయ్ మాత్రం కారుతో సహా కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్బర్ట్ విద్యనభ్యసిస్తున్నాడు. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, బాధిత కుటుంబాన్ని నవంబర్ 21న పరామర్శించారు. షార్జా, అలాగే దుబాయ్ పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఈ ఘటన విషాదాంతమయ్యింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









