శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 కోట్ల విదేశీ నోట్లు..!
- November 22, 2017
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కే కాదు.... కోట్లాది రూపాయల ఫారెన్ కరెన్సీ తరలింపునకు అడ్డాగా మారుతోంది. నిన్న ఒక్క రోజే 4 కోట్ల విదేశీ నోట్లు పట్టు బడడం సంచలనం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చరిత్ర లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీ పట్టు బడడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా విదేశాలకు పెద్ద మొత్తం లో ఫారిన్ కరెన్సీ తరలుతున్నట్లు గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేసి, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత వారు హైదరాబాద్ పోలీసులకు ఉప్పందించారు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులు
గత 15 రోజులుగా ఎయిర్ పోర్టులో గట్టి నిఘా ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ పట్టుబడింది.
.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ వెళ్లున్న రవూఫ్, అమన్ పై అధికారులకు అనుమానం కలిగింది. వారిని తనిఖీ చేయగా కుప్పలు తెప్పలుగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇందులో ఏడు దేశాలకు నోట్స్ ఉన్నాయి. నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయి...? ఈ కరెన్సీ తరలింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులు
ఎవరెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









