శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 కోట్ల విదేశీ నోట్లు..!
- November 22, 2017
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కే కాదు.... కోట్లాది రూపాయల ఫారెన్ కరెన్సీ తరలింపునకు అడ్డాగా మారుతోంది. నిన్న ఒక్క రోజే 4 కోట్ల విదేశీ నోట్లు పట్టు బడడం సంచలనం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చరిత్ర లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీ పట్టు బడడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా విదేశాలకు పెద్ద మొత్తం లో ఫారిన్ కరెన్సీ తరలుతున్నట్లు గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేసి, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత వారు హైదరాబాద్ పోలీసులకు ఉప్పందించారు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులు
గత 15 రోజులుగా ఎయిర్ పోర్టులో గట్టి నిఘా ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ పట్టుబడింది.
.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ వెళ్లున్న రవూఫ్, అమన్ పై అధికారులకు అనుమానం కలిగింది. వారిని తనిఖీ చేయగా కుప్పలు తెప్పలుగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇందులో ఏడు దేశాలకు నోట్స్ ఉన్నాయి. నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయి...? ఈ కరెన్సీ తరలింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులు
ఎవరెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







