శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 కోట్ల విదేశీ నోట్లు..!
- November 22, 2017
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కే కాదు.... కోట్లాది రూపాయల ఫారెన్ కరెన్సీ తరలింపునకు అడ్డాగా మారుతోంది. నిన్న ఒక్క రోజే 4 కోట్ల విదేశీ నోట్లు పట్టు బడడం సంచలనం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చరిత్ర లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీ పట్టు బడడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా విదేశాలకు పెద్ద మొత్తం లో ఫారిన్ కరెన్సీ తరలుతున్నట్లు గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేసి, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత వారు హైదరాబాద్ పోలీసులకు ఉప్పందించారు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులు
గత 15 రోజులుగా ఎయిర్ పోర్టులో గట్టి నిఘా ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ పట్టుబడింది.
.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ వెళ్లున్న రవూఫ్, అమన్ పై అధికారులకు అనుమానం కలిగింది. వారిని తనిఖీ చేయగా కుప్పలు తెప్పలుగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇందులో ఏడు దేశాలకు నోట్స్ ఉన్నాయి. నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయి...? ఈ కరెన్సీ తరలింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులు
ఎవరెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







