ఇవాంకా సదస్సులో ప్రసంగించనున్న చెర్రీ
- November 25, 2017
హైదరాబాద్: సినీ నటుడు రాంచరణ్ అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రాంచరణ్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇవాంక ట్రంప్ రానుంది. ఈ సందర్భంగా ఆమె ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాంకతో పాటుగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, సానియామీర్జా, గోపీచంద్, మిథాలీరాజ్, గవాస్కర్, మానుషి చిల్లర్, సోనమ్ కపూర్, అదితిరావులు ఈ సదస్సులో తమ సందేశాలివ్వనున్నారు.
ప్రప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుతో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో మరింత ప్రాధాన్యం లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. ''పెట్టుబడుల విషయంలో ఇతర మెట్రో నగరాల ఏకఛత్రాధిపత్యానికి గండిపడి భారీస్థాయి పెట్టుబడిదారులు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి వాళ్లకు కూడా అంతర్జాతీయ ధోరణులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది'' అని మీడియాతో జయేశ్రంజన్ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







