ఇవాంకా సదస్సులో ప్రసంగించనున్న చెర్రీ
- November 25, 2017
హైదరాబాద్: సినీ నటుడు రాంచరణ్ అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రాంచరణ్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇవాంక ట్రంప్ రానుంది. ఈ సందర్భంగా ఆమె ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాంకతో పాటుగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, సానియామీర్జా, గోపీచంద్, మిథాలీరాజ్, గవాస్కర్, మానుషి చిల్లర్, సోనమ్ కపూర్, అదితిరావులు ఈ సదస్సులో తమ సందేశాలివ్వనున్నారు.
ప్రప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుతో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో మరింత ప్రాధాన్యం లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. ''పెట్టుబడుల విషయంలో ఇతర మెట్రో నగరాల ఏకఛత్రాధిపత్యానికి గండిపడి భారీస్థాయి పెట్టుబడిదారులు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి వాళ్లకు కూడా అంతర్జాతీయ ధోరణులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది'' అని మీడియాతో జయేశ్రంజన్ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







