రిస్క్ చేసిన బన్నీ
- November 26, 2017వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ మురిసిపోతున్నాడు. ఇదంతా బన్నీ క్రెడిట్ నే అంటున్నాడు. ఎందుకంటే.. ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్క్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారని చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అను నేను' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ ని ఆరోజు చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం