సౌదీ: ఉగ్రసంస్థల నిర్మూలనపై ఉక్కుపాదం
- November 26, 2017
రియాద్: ఉగ్రసంస్థల నిర్మూలనలో తమ మిత్రదేశాలకు సహకరించనున్నట్టు సౌదీ రాకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. రియాద్లో సౌదీ మిత్రదేశాల సమావేశం జరిగింది. సౌదీ మిత్రదేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. మిత్రదేశాలకు అవసరమైన ఆయుధాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవ్యతిరేక ఆపరేషన్కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. సౌదీ మిత్రదేశాలన్ని పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ సమిష్టి కృషి చేస్తున్నాయనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందించాలన్నదే తమ అభిమతం అన్నారు. ఇస్లామిక్ మిలిటరీ అలియన్స్ (ఐఎంఏ) 2015, డిసెంబర్15న రియాద్లో ఏర్పాటైంది. ఈ గ్రూప్లో ప్రస్తుతం 41 సభ్య దేశాలున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ (రిటైర్డ్ ) రాహిల్ షరీఫ్ ఈఏడాది ఏప్రిల్ నుంచి సౌదీ సంకీర్ణదళాలు నిర్వహిస్తున్న యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









