ఇవాంకా పెడ్యూల్

- November 27, 2017 , by Maagulf
ఇవాంకా పెడ్యూల్

హైదరాబాద్ : ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా ట్రంప్ ట్రెడెంట్ హోటల్ లో బస చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. 5. 50కి తిరిగి హోటల్ కు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10. 40కి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుని జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్ర 5 వరకు అక్కడే ఉండి అటునుంచి అమెరికాకు తిరుగుపయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com