బిత్తిరి సత్తిపై దాడి...ఆసుపత్రిలో చేరిక
- November 27, 2017
ఫిల్మ్నగర్: పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం బిత్తిరి సత్తి బంజారాహిల్స్లోని ఎమ్మెల్యేకాలనీలో గల ఛానల్ కార్యాలయానికి కారులో డ్రైవర్తో కలిసి రోజూలాగే వచ్చారు. డ్రైవర్ కారు ఆపగానే కార్యాలయంలోకి వెళ్లేందుకు సత్తి కారు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని కళాసిగూడకు చెందిన మణికంఠగౌడ్ (26) సత్తిపై పిడుగుద్దులు కురిపించాడు. తెలంగాణ భాషను అవమానించేలా నీ మాటలు ఉన్నందున దాడి చేస్తున్నానని, తీన్మార్ కార్యక్రమం ద్వారానే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మణికంఠగౌడ్ కేకలు వేశాడు. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న కొందరు మణికంఠగౌడ్ను పట్టుకుని చితకబాదారు. ఓ వ్యక్తి తన శిరస్త్రాణంతో నిందితుడిపై దాడి చేశాడు. అందరూ నిందితుడిని కదలనివ్వకుండా పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన బిత్తిరి సత్తిని బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సత్తి ఫిర్యాదు మేరకు మణికంఠగౌడ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. మణికంఠగౌడ్ను ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ వివిధ కోణాల్లో విచారించారు. అతనికి మతి స్థిమితం లేదని కుటుంబీకులు ఇన్స్పెక్టర్ దృష్టికి తెచ్చారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







