'ఓ స్త్రీ రేపు రా'ఆడియో వేడుక ఈ నెల 19న
- November 14, 2015
ఆశిష్ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ ప్రధాన పాత్రధారులుగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాసుకునేవారని దర్శక నిర్మాత అశోక్రెడ్డి పేర్కొన్నారు. కొన్ని చోట్ల భయంతో చాలా మంది తమ గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగిందని, ఇలాంటి డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. జి.వి. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను సినీ ప్రముఖలు సమక్షంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నామని, అలాగే సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









