'ఓ స్త్రీ రేపు రా'ఆడియో వేడుక ఈ నెల 19న
- November 14, 2015
ఆశిష్ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ ప్రధాన పాత్రధారులుగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాసుకునేవారని దర్శక నిర్మాత అశోక్రెడ్డి పేర్కొన్నారు. కొన్ని చోట్ల భయంతో చాలా మంది తమ గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగిందని, ఇలాంటి డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. జి.వి. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను సినీ ప్రముఖలు సమక్షంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నామని, అలాగే సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







