విజేతల్ని ఆకాశానికి ఎత్తే విధానం మారాలి..
- November 29, 2017
ఆటలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సరదాగా మొదలు పెట్టిన ఆట అదే కెరీర్గా మారుతుందని ఎవరూ ఊహించరు. అవకాశాలు కూడా అందర్నీ వరించవు. గెలుపు ఓటముల రుచి చూస్తూ, ఎత్తు పల్లాల్ని అధిగమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొటూ చివరకు ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. అది ఒక్క ఆటల్లోనే కాదు.. అన్నింటా ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ విజేతల్ని మాత్రమే ఆకాశానికి ఎత్తే ధోరణి సరికాదంటున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా క్రీడా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చా గోష్టిలో గోపీచంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రీడలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక క్రీడల్ని మరచి పోతున్నాం. మీడియా కూడా స్థానిక క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి. పారిశ్రామిక వేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించాలి అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడల్ని ఒక పరిశ్రమగా భావించి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి అని అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఆటలు ఆడే వాళ్లందర్నీ ఛాంపియన్లుగా భావించి ఆ దిశగా ప్రోత్సహిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









