నటుడు చంద్రమోహన్ కుమార్తె ఫలక్నుమాలో నృత్య ప్రదర్శన
- November 30, 2017
ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది తెలంగాణా ప్రభుత్వం. విందుకు ముందు అతిధులను సమ్మోహన పరిచే అద్భుత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. మనదేశ సంప్రదాయ నత్య సమ్మేళనాలనన్నింటినీ మేళవించి ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి నంబూద్రి కూచిపుడి నృత్యం చేసింది. ఇందుకు గాను పన్నెండు రోజుల క్రితమే కేంద్రప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని..సమయం తక్కువగా ఉండడంతో రోజూ గంటల పాటు సాధన చేశామన్నారు. అతిరథ మహారథుల సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించడం మరచి పోలేని అనుభూతిని మిగిల్చిందని ఓ ఇంటర్వ్యూలో మాధవి చెప్పుకొచ్చారు. అటు నృత్యం, ఇటు సంగీతంతో సాగిన ఈ ప్రదర్శన భిన్నంత్వంలో ఏకత్వాన్ని సూచించింది. ఇవాంకతో సహా ఆహుతులందర్నీ అలరించింది ఈ నృత్య ప్రదర్శన.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







