నటుడు చంద్రమోహన్ కుమార్తె ఫలక్నుమాలో నృత్య ప్రదర్శన
- November 30, 2017ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది తెలంగాణా ప్రభుత్వం. విందుకు ముందు అతిధులను సమ్మోహన పరిచే అద్భుత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. మనదేశ సంప్రదాయ నత్య సమ్మేళనాలనన్నింటినీ మేళవించి ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి నంబూద్రి కూచిపుడి నృత్యం చేసింది. ఇందుకు గాను పన్నెండు రోజుల క్రితమే కేంద్రప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని..సమయం తక్కువగా ఉండడంతో రోజూ గంటల పాటు సాధన చేశామన్నారు. అతిరథ మహారథుల సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించడం మరచి పోలేని అనుభూతిని మిగిల్చిందని ఓ ఇంటర్వ్యూలో మాధవి చెప్పుకొచ్చారు. అటు నృత్యం, ఇటు సంగీతంతో సాగిన ఈ ప్రదర్శన భిన్నంత్వంలో ఏకత్వాన్ని సూచించింది. ఇవాంకతో సహా ఆహుతులందర్నీ అలరించింది ఈ నృత్య ప్రదర్శన.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!