'ఎన్నారై కోఆర్డినేటర్' అర్హత ఆయనకుందా?
- November 30, 2017
లండన్: ఎటువంటి భాష పరిజ్ఞానం , సాహిత్య పరిచయం లేని వ్యాపారవేత్త అయిన మహేష్ బిగాలను తెలుగు ప్రపంచ మహాసభల ఎన్నారై సమన్వయకర్తగా నియమించడాన్ని టిపిసిసి ఎన్నారై సమన్వయకర్త గంప వేణుగోపాల్ తప్పు పట్టారు. ఎమ్మెల్యే గణేష్ బిగల తమ్ముడని చెప్పి ఎన్నారై సమన్వయకర్తగా నియమించి తెలుగు మహా సభల స్థాయిని తగ్గించారని ఆయన ఓ ప్రకటనలో అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ,ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా ,దుబాయ్ ,సింగపూర్ అన్ని దేశాల్లో నిరసన వ్యక్త పరిచి వెంటనే మహేష్ బిగాలను ఆ పదవి నుండి తప్పించేలా చూడాలని ఆయన ఎన్నారైలను కోరారు.
అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగాలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కోఆర్డినేటర్గా నియమించారని ఆయన అడిగారు. ఎటువంటి భాష పరిజ్ఞానం ,సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆయన అన్నారు.
మహేష్ను వెంటనే తొలగించి ఆ స్థానం లో సాహిత్యవేత్తలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల ఈ పదవి ఇప్పించారని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఎటువంటి సాహిత్య స్పృహ ,భాష ప్రావిణ్యం లేని వాళ్ళు విదేశాల్లో సమావేశాలు పెట్టి ఏమి మాట్లాడుతారని ,ఇది రాజకీయ పదవుల పంపకం కాదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









