మహేష్ చిత్రాన్ని కొన్న లహరి

- December 01, 2017 , by Maagulf
మహేష్ చిత్రాన్ని కొన్న లహరి

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అను నేను". కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం జెడ్-స్వీడుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, ఈ సినిమా ఆడియో హక్కులని లహరి మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అదెంత అనేది మాత్రం చెప్పడం లేదు.
"భరత్ అను నేను" ఓ పొలిటికల్ సటైర్ అంటున్నారు. ఇందులో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ సరసన కైరా అద్వాని జతకట్టనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేష్-కొరటాల కలయికలో వస్తోన్న "భరత్ అను నేను" పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com