యూరోపియన్ శాటిలైట్కు చిక్కిన ఢిల్లీ కాలుష్యం
- December 03, 2017
న్యూఢిల్లీ: నవంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని కాలుష్యాన్ని యూరోపియన్ శాటిలైట్ నిక్షిప్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం భారత్తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడారు.
ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర రూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇదే విషయాన్ని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) కూడా తెలిపింది. ఉత్తర భారతం ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిపే ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
నవంబర్ 10న దేశ రాజధాని ప్రాంతాన్ని కాలుష్యపు మేఘాలు ఏ విధంగా కమ్ముకున్నాయో తెలిపే చిత్రాలను శుక్రవారం విడుదల చేసింది. ఈఎస్ఏకు చెందిన సెంటినల్ 5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీశారు.
భూగ్రహంపై వాతావరణ మార్పుల్ని ఇది పరిశీలిస్తుందని ఈఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ ఎర్త్ అజ్బర్వేషన్ జోసెఫ్ తెలిపారు. నవంబర్ 6 నుంచి 14 మధ్య తక్కువ వాయు వేగం, గాలిలో అధిక తేమ, పంటలను తగలబెట్టడం తదితర కారణాలతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిల్ని దాటింది.
మరో ఉపగ్రహ చిత్రంలో ఉత్తర పాట్నా, దక్షిణ రాయపూర్ ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి వెలవడుతున్ కాలుష్యాన్ని చిత్రీకరించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







