" అజ్ఞాతవాసి " మిస్ అవుతున్న సీనియర్ నటి ఖుష్బూ
- December 04, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం " అజ్ఞాతవాసి " లో తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని అన్నారు సీనియర్ నటి ఖుష్బూ. యూనిట్ సభ్యులను విడిచివెళ్ళడం బాధగా ఉందంటూ..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి దిగిన సెల్ఫీని ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. కొందరిని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటివారే ఈ మూవీ సభ్యులు. నా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నా. ఇంత మంచివారికి వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, అలాగే.. సహ నటుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!