ఏపీలో భారీ వర్షాలు.. ISRO హెచ్చరిక
- December 04, 2017
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి... ఏడో తేదీ నాటికి మధ్య, ఉత్తర కోస్తాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇస్రో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇస్రో అంచనా ప్రకారం ఈ నెల ఏడో తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం నాటి మోడల్స్ ప్రకారం వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఏడో తేదీ సాయంత్రం నుంచి పదో తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముంది. అయితే తీరం దిశగా వచ్చేసరికి తీవ్ర వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని విశ్లేషించింది. ఇస్రో హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో