ఇక పూర్తిస్థాయిలో ట్రంప్ ట్రావెల్ బ్యాన్
- December 05, 2017
వాషింగ్టన్: ముస్లిం మెజార్టీ దేశాల నుంచి ప్రజలు అమెరికా రాకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్యావెల్ బ్యాన్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొనసాగుతున్న ఈ నిషేధంపై ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇక పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇరాన్, లిబియా, సిరియా, యెమన్, సోమాలియా, ఛాద్ దేశాల నుంచి ప్రజలెవరూ అమెరికా రాకుండా వారిపై నిషేధం విధించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన న్యాయస్థానాలు ట్రావెల్ బ్యాన్పై కొన్ని ఆంక్షలు విధించాయి.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గరి సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కుమార్తె తదితర బంధువులకు అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే వారికి అనుమతినివ్వాలని కింది కోర్టులు పేర్కొన్నాయి.
అయితే తాజాగా సుప్రీంకోర్టు.. నిషేధంపై కింది కోర్టులు విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేయాలని పేర్కొంది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. దీంతో ప్రస్తుతంఅధికారులు నిషేధంపై న్యాయ అంశాలను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!