రేపటి నుండి సెట్స్ పైకి 'సైరా'

- December 05, 2017 , by Maagulf
రేపటి నుండి సెట్స్ పైకి 'సైరా'

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ సైరా చిత్రం రేపటి నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో తొలి షెడ్యూల్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సంబంధించి మేకోవర్ పూర్తిగా మార్చుకోగా, టెస్ట్ షూట్ కూడా పూర్తైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సినిమాకి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ అందరిని సెలక్ట్ చేసినప్పటికి చివరి మూమెంట్ లో రెహమాన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని యూనిట్ ఆలోచనలో పడింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న సైరా చిత్రం బాహుబలి రికార్డులు తిరగరాసేలా రూపొందనున్నట్టు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com