తెలుగు నేతలకు గట్టిగా తగిలిన మోడీ మాటలు
- December 06, 2017
తెలంగాణాలో మైనార్టీలకు రిజర్వేషన్, ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇద్దరికీ అదిరిపోయే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. దేశంలో రిజర్వేషన్లను 50 శాతం పెంచడం సాధ్యం కాదన్నారు. పెంచే అవకాశం ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు.
గుజరాత్లో పటేల్ వర్గం తమకు రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. పటేల్ వర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినా.. దాని ప్రకంపనలు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. దేశమంతా ప్రధాని ఇదే మాట మీదుంటే మరి కాపులు, మైనార్టీల రిజర్వేషన్ల మాట ఏంటనే భయం తెలుగు నేతలకు పట్టుకుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!