తెలుగు నేతలకు గట్టిగా తగిలిన మోడీ మాటలు
- December 06, 2017
తెలంగాణాలో మైనార్టీలకు రిజర్వేషన్, ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇద్దరికీ అదిరిపోయే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. దేశంలో రిజర్వేషన్లను 50 శాతం పెంచడం సాధ్యం కాదన్నారు. పెంచే అవకాశం ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుందన్నారు.
గుజరాత్లో పటేల్ వర్గం తమకు రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించింది. పటేల్ వర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినా.. దాని ప్రకంపనలు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. దేశమంతా ప్రధాని ఇదే మాట మీదుంటే మరి కాపులు, మైనార్టీల రిజర్వేషన్ల మాట ఏంటనే భయం తెలుగు నేతలకు పట్టుకుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







