భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా
- December 09, 2017_1512818762.jpg)
చైనా భూభాగంలోకి అక్రమంగా డ్రోన్ను ప్రవేశపెట్టినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని చైనా మీడియా కోరుతోంది. చైనాలోకి అక్రమంగా ప్రవేశించిన భారత డ్రోన్ను కూల్చేసినట్టు చైనా ఆర్మీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ను భారత్ కావాలనే వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి పంపించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో సిక్కిం సెక్టార్లోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత్ మధ్య రహదారి విషయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలోకి భారత్ మానవ రహిత డ్రోన్ను పంపించింది. చాలా సున్నితమైన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని ఇరు దేశాలూ గతంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ ఆ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని 'గ్లోబల్ టైమ్స్' రాసింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ అక్కడకు వచ్చిందని భారత్ చెబుతుండడం పూర్తిగా అబద్ధమని ఆరోపించింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!