భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా
- December 09, 2017
చైనా భూభాగంలోకి అక్రమంగా డ్రోన్ను ప్రవేశపెట్టినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని చైనా మీడియా కోరుతోంది. చైనాలోకి అక్రమంగా ప్రవేశించిన భారత డ్రోన్ను కూల్చేసినట్టు చైనా ఆర్మీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ను భారత్ కావాలనే వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి పంపించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో సిక్కిం సెక్టార్లోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత్ మధ్య రహదారి విషయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలోకి భారత్ మానవ రహిత డ్రోన్ను పంపించింది. చాలా సున్నితమైన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని ఇరు దేశాలూ గతంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ ఆ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని 'గ్లోబల్ టైమ్స్' రాసింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ అక్కడకు వచ్చిందని భారత్ చెబుతుండడం పూర్తిగా అబద్ధమని ఆరోపించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







