భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా
- December 09, 2017
చైనా భూభాగంలోకి అక్రమంగా డ్రోన్ను ప్రవేశపెట్టినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని చైనా మీడియా కోరుతోంది. చైనాలోకి అక్రమంగా ప్రవేశించిన భారత డ్రోన్ను కూల్చేసినట్టు చైనా ఆర్మీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ను భారత్ కావాలనే వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి పంపించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో సిక్కిం సెక్టార్లోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత్ మధ్య రహదారి విషయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలోకి భారత్ మానవ రహిత డ్రోన్ను పంపించింది. చాలా సున్నితమైన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని ఇరు దేశాలూ గతంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ ఆ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని 'గ్లోబల్ టైమ్స్' రాసింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ అక్కడకు వచ్చిందని భారత్ చెబుతుండడం పూర్తిగా అబద్ధమని ఆరోపించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







