లలితా జ్యూవెలర్స్‌లో చోరీ

- December 09, 2017 , by Maagulf
లలితా జ్యూవెలర్స్‌లో చోరీ

హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలర్స్‌లో చోరీ జరిగింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వచ్చారు. కాగా ఓ బంగారు హారాన్ని తీసుకుని చూసిన సదరు మహిళలు ఒరిజినల్ హారం స్థానంలో నకిలీ హారాన్ని ఉంచి తిన్నగా అక్కడినుంచి జారుకున్నారు. దుకాణ నిర్వాహాకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతో జరిగిన దొంగతనం వెలుగుచూసింది. వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com