వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీపై కేసు అసలేం జరిగింది?

- December 09, 2017 , by Maagulf
వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీపై కేసు అసలేం జరిగింది?

రజనీకాంత్‌ లేటెస్ట్ మూవీ '2 పాయింట్ 0'. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న మూవీ షూటింగ్‌ ఇటీవలే ఫినిష్ అయ్యింది. ఐతే, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కాకపోవడంతో వచ్చేఏడాది జనవరికి వాయిదా వేశారు. అప్పటికీ పనులు పూర్తికావని భావించిన ప్రొడ్యూసర్స్ ఏప్రిల్‌కి వెళ్లింది. ఇలా వెనక్కి వెళ్లడంపై ఇండస్ర్టీలో రకరకాలుగా చర్చ మొదలైంది.
మూవీ వాయిదా వెనుక యూఎస్‌కి చెందిన వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ కారణమంటూ వార్తలు వెలువడుతున్నాయి. రోబో-2కి సంబంధించి వీఎఫ్‌ఎక్స్‌ పనులను హాలీవుడ్‌కి చెందిన ఓ సంస్థకు అప్పగించారు. అనుకున్న సమయానికి చేయలేకపోయింది. దీంతో మేకర్స్ ఆ సంస్థపై దావా వేసినట్లు తెలుస్తోంది. రజనీ కాంత్- అక్షయ్‌కుమార్- ఎమీజాక్సన్ కాంబోలో రానున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com