బాలీవుడ్ హీరోతో ప్రిన్స్ సరికొత్త ప్రయోగం
- December 10, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే పరిమితమైన మహేష్ ఇటీవల స్పైడర్ చిత్రంతో కోలీవుడ్కి ఎంటర్ అయ్యాడు. స్పైడర్లో మహేష్ అందం చూసి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం మహేష్కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో పలు వాణిజ్య సంస్థలు ఆయనతో పలు యాడ్స్ చేస్తున్నాయి. గతంలో థమ్సప్ ప్రమోషన్ కోసం మహేష్ క్రేజ్ వాడుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నేషనల్ లెవల్లో ప్రమోషన్ చేస్తుంది. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రకటనలో నటించడం విశేషం. వీరిపై కాలిఫోర్నియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, రణ్వీర్ నటించిన పద్మావతి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందిన థమ్సప్ యాడ్లో మహేష్ కాస్త స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!