దోహలో 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో నేత్రపర్వంగా దీపావళి
- November 16, 2015
దోహాలో కార్నిష్ సమీపంలో ఉన్న ఎలిగెన్స్ కేజిల్ హోటల్ లో కతార్ లోని తెలుగు వారి ప్రముఖ సంస్కృతిక సంస్థ 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో తేది 13.11.15 న నేత్ర పర్వంగా నిర్వహింపబడ్డాయి. ఈ ఈవెంట్ లో 70 మంది దాకా పాల్గొన్నారు. ఈ దీపావళి సంబరాలు, చిన్నారుల ప్రార్ధనతో మహిళా మణుల జ్యోతి ప్రజ్వలనతో సుభారంబమయ్యాయి. అనంతరం వారు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొందరు మహిళలు ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. తరువాతి అంశాలుగా పిల్లల సోలో, డ్యూయెట్ మరియు బృంద నృత్య ప్రదర్సనలు, స్త్రీమూర్తుల నృత్య గాన ప్రదర్శనలు సాగాయి. పిల్లలు, పెద్దల కోసం ఆటల పోటీలు, పెళ్ళైన వారి సంయుక్త ఆటలు, సాముహిక క్రీడలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. ఆబాలగోపాలం ఇక్కడకు విచ్చేసిన ఆటపాటల్లో మురిసిపోయారు. గ్రూప్ ఫోటోగ్రఫీ, బహుమతుల పంపిణీ తో ఈ కార్యక్రమానికి భరతవాక్యం పలికి, మరల త్వరలోనే కలసుకోనేందుకు ఉవ్విళ్ళూరుతూ అందరూ వీడ్కోలు పలికారు.




తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







