మాదకద్రవ్యం వికటించడంతో స్నేహితుడి మరణం... మృతదేహాన్ని దాచిపెట్టిన మిత్రబృందం
- December 11, 2017
దుబాయ్: వయస్సుని మించిన దురలవాట్లు ఆ యువకులను జైలు పాల్జేసింది. తమ తోటి ఓ స్నేహితుడు మాదకద్రవ్యంను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అకస్మాత్తుగా చనిపోయాడు. మిగిలిన ముగ్గురు యువకులు నిర్ఘాంతపోయారు. తమ స్నేహితుడు ఆ విధంగా మరణించడంతో వారు తీవ్రంగా భయపడ్డారు. నేరాన్ని పోలీసులు తమపై నెడతారనే కారణంతో మృతదేహాన్ని ఎవరూ చూడని ఒక నిర్జన ప్రదేశానికి తరలించారు. కారును శుభ్రంగా కడిగి మృతదేహాన్ని కారులో ఉంచి ఎవరికీ కనిపించకుండా లహ్బాహ్ అనే ప్రాంతంలో దాచిపెట్టారు. మరణించిన యువకుడి సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చి తమకేమీ తెలియనట్టుగా నటించారు. కొడుకు కనిపించకపోవడంతో మృతుని తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు స్నేహితుడికి సంబంధించిన సమాచారం తమకేమీ తెలియదని ముగ్గరూ చెప్పారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముగ్గురిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. మృతదేహాన్ని తామే దాచిపెట్టామని తెలిపాడు. మాదక ద్రవ్యంను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్నేహితుడు చనిపోయాడని, భయమేయడంతో ఈ పని చేశామని చెప్పాడు. స్పృహలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, ప్రయోజనం దక్కలేదని తెలిపాడు. దీంతో నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై కోర్టులో విచారణ మొదలైంది. నిందితుల వయసు 18, 19 సంవత్సరాలని, నిందితులందరూ విద్యార్థులని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్లో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







