'మహానటి'గా మొదట సమంతనే అనుకున్నాం ..కానీ..
- December 11, 2017టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై బయోపిక్ చిత్రాలు ఏవీ రాలేదు. మొదటి సారిగా అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది నిర్మాత స్వప్నా దత్. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుండగా సమంత ఓ కీలకపాత్ర పోషిస్తోంది.

దాదాపుగా సినిమా షూటింగ్ అంతా పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో సావిత్రి పాత్ర కోసం ముందు సమంతనే ఎంపిక చేశామని, కానీ ఆ పాత్రలో కొత్త వారిని తీసుకుంటే బావుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడంతో కీర్తిని ఫైనల్ చేశామని వెల్లడించింది. ఇందుకోసం సమంత సంతకం కూడా చేసేసింది.

కానీ సావిత్రి పాత్రలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు నాగ్అశ్విన్ భావించడంతో.. ఆ పాత్ర కోసం కీర్తిసురేష్ని ఎంపిక చేసి సమంతకు చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చేశాం. అలాగే ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నప్పటి నుంచి చాలా పరిశోధనలు చేశామని, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిని కలిసి ఆమె గురించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలిపారు.

ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించి మెప్పించగలదని..పది సెకన్లలో వంద హావభావాలను పలికించగల గొప్ప నటి సావిత్రి అలాంటి మహానటి సినిమా తెరకెక్కిస్తుందన్నందుకు గర్వంగా ఉందని స్వప్నాదత్ చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







